ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో మేక్రాన్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.