ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
అనంతపురంలో ప్రముఖ కవి, సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత, తెలంగాణ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు సొసైటీ ఫర్ హ్యూమనిజం అండ్ సోషల్ ఛేంజ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం జరిగింది.
శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమ సింఘే (73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు.