Namaste NRI

అమెరికా కొత్త నిబంధన … వీసా కావాలంటే

అమెరికా వీసా, గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే భారతీయులు ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తులతోపాటు తమ సోషల్‌ మీడియా ఖాతాల సమాచారాన్ని కూడా ఇప్పుడు అందచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌(డీహెచ్‌ఎస్‌) మార్చి 5న ఓ నోటీసులో వెల్లడించింది. గ్రీన్‌ కార్డులు, పౌరసత్వం, ఇతర ప్రయోజనాలు కోరుతూ దరఖాస్తు చేసుకునే భారతీయులు సహా ఏటా 35 లక్షల మందికిపైగా విదేశీయుల నుంచి ఈ సమాచారాన్ని కోరనున్నట్టు డీహెచ్‌ఎస్‌ ప్రకటించింది. ఇమ్మిగ్రేషన్‌ స్క్రీనింగ్‌ను కట్టుదిట్టం చేయాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది జనవరిలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతకం చేసిన 14161 ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌లో భాగంగా ఈ ప్రతిపాదన ఉంది.

కొత్త నిబంధన మేరకు దరఖాస్తుదారులు తొమ్మిది ప్రధాన ఇమ్మిగ్రేషన్‌ ఫారాలలో తమ సోషల్‌ మీడియా ఖాతాల వివరాలను అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌కు అందచేయవలసి ఉంటుంది. పాస్‌వర్డ్‌ తెలియచేయవలసిన అవసరం లేదు. ఈ సమాచారాన్ని దరఖాస్తుల గుర్తింపును తనిఖీ చేసేందుకు, జాతీయ భద్రతా ముప్పులను అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు.

 భారతీయ ఇమ్మిగ్రెంట్లు ముఖ్యంగా స్టెమ్‌ ప్రొఫెషనల్స్‌, హెచ్‌-1బీ ఆశావహులు, ఈబీ-5 పెట్టుబడిదారులకు ఈ కొత్త నిబంధనతో నిఘా మరింత అధికమవుతుంది. సాధారణ ఆన్‌లైన్‌ సంభాషణలు కూడా సమీక్షకు గురవుతాయని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో వ్యక్తుల ప్రవర్తనపై నిఘా ఉంటుందని, పోస్టులు, కామెంట్లు, చాటింగ్‌లపై సమీక్ష ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events