Namaste NRI

హైదరాబాద్ లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం

అంతర్జాతీయ వాణిజ్య వివాదాల (ఆర్బిట్రేషన్‌) మధ్యవర్తుల కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వీ.రమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటుతో వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. పీవీ నరసింహారావు హయంలో ఆర్థిక సంస్కరణలు జరిగాయని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారు లిటిగేషన్లతో ఇబ్బందులు పడుతుంటారని తెలిపారు. అయితే ఆ సమస్యలను పరిష్కరించేందుకు ఆర్బిట్రేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివాదాల పరిష్కారానికి కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పరిశ్రమలకు ఆర్బిట్రేషన్‌ కేంద్రంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

                ఈ కార్యక్రమానికి సీజేఐ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు జడ్జిలు ఎల్‌ నాగేశ్వరరావు, ఆర్‌.సుభాష్‌ రెడ్డి, హైకోర్టు సీజే హిమా కోహ్లీ, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events