టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న 54వ ప్రాజెక్ట్. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం. బాలీవుడ్ భామ మృణాళ్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం న్యూఢిల్లీలో కొనసాగుతోంది. అయితే మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్నా ఇన్స్టాస్టోరీస్లో పెట్టిన పోస్ట్ ప్రకారం ఈ ఇద్దరూ ఒకే లొకేషన్లో ఉన్నారని అర్థమవుతోంది. ఇదిలా ఉంటే సమ్థింగ్ స్పెషల్ కోసం షూటింగ్ కొనసాగుతోంది. త్వరలో అదేంటో చెబుతానంటూ రాసుకొచ్చింది. ఈ రెండూ సింక్ అవుతుండటంతో రష్మిక ఫ్యామిలీ ఎంటర్టైనర్లో గెస్ట్ రోల్లో కనిపించనుండటం దాదాఫు ఫైనల్ అయినట్టేనని క్లారిటీ వచ్చేస్తుంది.
గీతగోవిందం, డియర్ కామ్రేడ్తో సిల్వర్ స్క్రీన్పై సూపర్ జోడీగా క్రేజ్ సంపాదించిన విజయ్, రష్మిక కాంబో, ఈ సినిమాలో మరోసారి మెరువబోతున్నారని తెలియడంతో ఆనందంలో ఎగిరిగంతేస్తున్నారు మూవీ లవర్స్, ఫ్యాన్స్. మరి దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఏదైనా వస్తుందేమో చూడాలంటున్నారు.