Namaste NRI

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు సైనికుడు

తమిళనాడులోని ఊటీ కొండల్లో సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కూలిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా వాసి మృతి చెందారు. కురబల కోట మండలం ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ్‌ రక్షణ శాఖలో లాన్స్‌ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌కు వ్యక్తిగత భద్రతా బృందంలో సభ్యుడిగా ఉన్న సాయితేజ్‌  హెలికాప్టర్‌ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి చెందారు. సాయితేజ్‌ మృతి పట్ల చిత్తూరు జిల్లాకు చెందిన పలువురు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.  2013లో ఆర్మీలో జాయిన్‌ అయ్యాడు సాయితేజ్‌. సాయితేజ్‌ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయితేజ్‌కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. చివరిసారిగా వినాయక చవితికి సాయతేజ్‌ స్వగ్రామాని వచ్చినట్లు బంధువులు తెలిపారు.

Social Share Spread Message

Latest News