Namaste NRI

17 ఏళ్ల క్రితం నాటి ఘ‌ట‌న‌.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ర‌ష్యా అధ్య‌క్షుడు

17 ఏళ్ల క్రితం జ‌రిగిన ఘ‌ట‌న‌కు ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ జ‌ర్మ‌నీ మాజీ ఛాన్స‌ల‌ర్ ఏంజిలా మెర్క‌ల్‌ కు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. 2007లో సోచి న‌గ‌రంలో జ‌రిగిన ఓ మీటింగ్‌కు మెర్క‌ల్ హాజ‌ర‌య్యారు. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్ పెంపుడు శున‌కం లాబ్ర‌డార్ కోని కూడా వ‌చ్చింది. మెర్క‌ల్ కూర్చున్న కుర్చీ చుట్టూ ఆ శున‌కం ప‌హారా కాసింది. ఆ స‌మ‌యంలో మెర్క‌ల్ కాస్త ఆందోళ‌న‌కు గుర‌య్యారు. కుక్క‌ల‌కు భ‌య‌ప‌డే మెర్క‌ల్ ఆ ఘ‌ట‌న ప‌ట్ల సీరియ‌స్ అయ్యారు. ఇటీవ‌ల ఫ్రీడ‌మ్ అనే టైటిల్‌తో మెర్క‌ల్ ఓ పుస్త‌కాన్ని రాశారు. దాంట్లో ఆ ఘ‌ట‌న గురించి ఆమె ప్ర‌స్తావించారు. పుతిన్ పెంపుడు కుక్క వ‌ల్ల తాను చాలా ఇబ్బందిప‌డిన‌ట్లు పేర్కొన్నారు. త‌న‌ను బెదిరించేందుకు పుతిన్ ఆ ప‌ని చేశార‌ని మెర్క‌ల్ త‌న బుక్‌లో తెలిపారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల పుతిన్ మ‌రో సారి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ ఘ‌ట‌న ప‌ట్ల గ‌తంలోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పిన‌ట్లు క‌జ‌కిస్తాన్‌లో జ‌రిగిన ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో పుతిన్ తెలిపారు. మెర్క‌ల్‌కు కుక్క‌లంటే భ‌య‌మ‌న్న విష‌యం తెలియ‌ద‌ని, లేదంటే ఆ రోజు అలా జ‌రిగేది కాదు అని పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events