గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ‘లక్ష యువగళ గీతార్చన’ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా త్రిదండి చిన్నజీయర్ స్వామీ, రామజన్మభూమి ట్రస్ట్ కోశాధికారి గోవింద్గిరి మహారాజ్ హాజరయ్యారు.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్ నివాసానికి చేరుకున్న కేసీఆర్కు.. ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.