తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం వెంకటేశ్వరావు మాదవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. కాబోయే నూతన వధూవరులకు 365 రకాల వంటలను రుచి చూపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చెముడు లంకకు చెందిన ప్రత్తి సత్యనారాయణ కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకే సారి అరిటాకుల్లో భోజనం పెట్టారు.
సినీ హీరో బాలకృష్ణ చీరాల సుముద్ర తీరంలో సందడి చేసారు. ఇసుక ప్రాంతాలలోనూ, సముద్ర తీర ప్రాంతాలలో ప్రయాణించే ప్రత్యేక వాహనంలో బాలయ్య దంపతులు సరదాగా ఓపెన్ టాప్ జీప్లో షికారు చేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.