Skip to main content

Namaste NRI

ఒమిక్రాన్ ఎఫెక్ట్…ఈ నిబంధన ప్రవాసులకు ఇబ్బంది

దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. దీంతో అగ్రరాజ్యం సహా ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. ఇండియాలో కూడా నిత్యం లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రయాణ మార్గదర్శకాలను సవరించిన ప్రభుత్వం.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు 7 రోజుల పాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన ప్రవాసులకు ఇబ్బందిగా మారింది. మెడికల్‌ ఎమర్జెన్సీ, అత్యవసర పనుల నిమిత్తం ఇండియాకు వచ్చే వారి పరిస్థితి ఏంటని ప్రవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో సాధ్యమైనంత త్వరగా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Social Share Spread Message

Latest News