Namaste NRI

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్‌ తూర్పు భాగంలోని లుహాన్‌స్క్‌లోని బిలోహోరివ్కాలో  గ్రామంలోని పాఠశాలపై రష్యా బలగాలు బాంబు దాడి జరిపాయి. ఈ ఘటనలో 60 మంది వరకు చనిపోయారు. దీనిపై లుహాన్‌స్క్‌ గవర్నర్‌ సెర్హీ గైడాయ్‌ స్పందించారు. రష్యన్‌ సేనలు పాఠశాలపై ఒక బాంబును జారవిడిచాయని వెల్లడిరచారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వివరించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైందని, దాదాపు 4 గంటలు శ్రమిస్తేనే గానీ అగ్ని కీలలు అదుపులోకి రాలేదని తెలిపారు. 30 మంది శిథిలాల నుంచి వెలుపలికి తీసుకువచ్చామని తెలిపారు. కాగా ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా సేనలు దాడులు ముమ్మరం చేశాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events