Skip to main content

Namaste NRI

రష్యా రాయబారికి చేదు అనుభవం

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పోలాండ్‌లోని రష్యా రాయబారికి చేదు అనుభవం ఎదురైంది. రష్యా రాయబారి సెర్గీ ఆండ్రివ్‌పై పోలాండ్‌లో నిరసన కారులు రెడ్‌ పెయింట్‌ చల్లడంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికులను నివాళులు అర్పించకుండా అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనతో పోలాండ్‌ ప్రభుత్వం విమర్శళ పాలైంది. దౌత్యవేత్తకు భద్రత కల్పించడంలో విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.  ఆండ్రీవ్‌పై దాడిని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా ఖండిరచారు.  ఈ ఘటనతో రస్యా భయపడబోదని స్పష్టం చేశారు.  రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియట్‌ యూనియన్‌ సాధించిన విజయాన్ని గుర్తుచేసే విక్టరీ డే, మాస్కోలోని రెడ్‌ స్క్వేర్‌లో కవాతును ఘనంగా నిర్వహించారు.

Social Share Spread Message

Latest News