Namaste NRI

చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. జనవరి 8 నుంచి అమల్లోకి

చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలపై కీలక నిర్ణయం తీసుకుంది. జీరో కొవిడ్‌ విధానానికి స్వస్తి పలికేందుకు సిద్ధమైంది. విదేశీ ప్రయాణికులపై ఆంక్షలను తాజాగా ఎత్తివేసింది. ఇప్పటి వరకు విదేశీ ప్రయాణికులకు 5 రోజుల క్వారంటైన్‌ తప్పనిసరిగా అమలు చేస్తున్న చైనా ప్రభుత్వం, ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ నిబంధన జనవరి 8 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ నెగిటివ్‌ ధ్రువపత్రం చూపిస్తే చాలని పేర్కొంది. 48 గంటల ముందు కరోనా పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events