కెనడాకు చెందిన 18 ఏళ్ల జూలియెట్ లామర్ రాత్రికి రాత్రే కోటీశ్వరురాలు అయింది. పుట్టిన రోజు ముందు తాతయ్య సూచన మేరకు లాటరీ కొనుగొలు చేసిన ఆమెకు ఏకంగా రూ.290 కోట్ల జాక్పాట్ తగిలింది. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒకేసారి ఇంతడబ్బు వస్తే ఏం చేయాలో కూడా పాలుపోని పరిస్థితి ఉంటుంది. కానీ జూలియెట్ మాత్రం అప్పుడే రూ.150 కోట్లు ఖర్చు పెట్టేసింది. లాటరీ డబ్బు రాగానే తన కుటుంబం కోసం ఐదు మెర్సీడెస్ కార్లు కొనుగోలు చేసింది. దీని ధర ఒక్కోటి రూ.2 కోట్లు ఉంటుంది. అలాగే రూ.40 కోట్లతో పెద్ద బంగ్లా సొంతం చేసుకుంది. మరో రూ.100 కోట్లు పెట్టి ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్కు యజమాని అయింది. ఇక మిగిలిన డబ్బును మాత్రం భవిష్యత్ అవసరాల కోసం దాచుకుంది. అంతేకాదు తన తండ్రి సలహాలు సూచనతో ఆ డబ్బుతో పెట్టుబడులు కూడా పెడతానని చెబుతోంది.