Namaste NRI

అమెరికాలో ప్రమాదం

అమెరికాలోని ఓ డెయిరీ ఫామ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 18 వేల గోవులు ఆహుతయ్యాయి. టెక్సాస్‌ రాష్ట్రంలోని డిమ్మిట్‌లో గల సౌత్‌ ఫోర్క్‌ డెయిరీ ఫామ్‌లో ఈ నెల 10న రాత్రి ఈ దుర్ఘటన చోటుచేసుకొన్నది. ఫామ్‌లోని 90 శాతం గోవులను మృత్యువు కబళించింది. మృతిచెందిన ఒక్కో ఆవు సుమారు రూ.1.63 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక ప్రమాదంలో ఈ స్థాయిలో పశువులు మృతిచెందటం ప్రపంచంలోనే అత్యధికమని అంచనా. ఎరువుల ట్యాంక్‌ అతిగా వేడి కావడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events