Namaste NRI

డబుల్‌ ఇస్మార్ట్‌  రెండో షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో ప్రారంభం

రామ్‌ కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం డబుల్‌ ఇస్మార్ట్‌. పూరి కనెక్ట్స్‌ పతాకంపై పూరి జగన్నాథ్‌, ఛార్మికౌర్‌ నిర్మిస్తున్నారు. ముంబయిలో షూటింగ్‌ను షెడ్యూల్‌లో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా రెండో షెడ్యూల్‌ థాయ్‌లాండ్‌లో ప్రారంభమైంది. ఇందులో హీరో రామ్‌, సంజయ్‌దత్‌పై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రంలో సంజయ్‌దత్‌ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన మునుపెన్నడూ చూడని పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో కనిపిస్తారని చెబుతున్నారు. థాయ్‌లాండ్‌ షెడ్యూల్‌లో రామ్‌, సంజయ్‌దత్‌పై తీసే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర బృందం పేర్కొంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. డబుల్  ఇస్మార్ట్   తెలుగు,  తమిళం,  కన్నడ,  మలయాళం,  హిందీ  భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events