Skip to main content

Namaste NRI

ప్రవాసులపై కువైత్ ఉక్కుపాదం…12వేల మందిని 

గల్ఫ్ దేశం కువైత్ ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. గడిచిన కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడే వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. వరుస తనిఖీలు నిర్వహిస్తున్న ఆ దేశ భద్రతాధికారులు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి బహిష్కరించడం చేస్తున్నారు. ఈ క్రమంలో గడిచిన మూడు నెలల్లో ఏకంగా 12వేల మంది ప్రవాసులను దేశం నుంచి బహిష్కరించినట్లు తాజాగా వెలువడిన అంతర్గత మంత్రిత్వశాఖ గణాంకాల ద్వారా తెలిసింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరిపిన సోదాల్లో ఈ మేరకు ఉల్లంఘనదారులను గుర్తించి దేశం నుంచి వెళ్లగొట్టింది. వీరిలో కొందరు ప్రజా నైతిక చట్టాలను ఉల్లంఘించిన వారు ఉన్నట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. అలాగే రెసిడెన్సీ, కార్మిక చట్టాల ఉల్లంఘనదారులు అధిక సంఖ్యలో ఉన్నట్లు తెలిపింది.

Social Share Spread Message

Latest News