Skip to main content

Namaste NRI

ఇప్పటివరకు ఇండియన్‌ స్క్రీన్‌పై రానటువంటి కథ ఇది

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కాలింగ్‌ సహస్ర. డాలీషా కథానాయిక. అరుణ్‌ విక్కిరాలా దర్శకత్వం. విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో  శివబాలాజీ, మనోహరన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం  ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్‌ మాట్లాడుతూ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కథ, కథనాలు వైవిధ్యంగా ఉంటాయి.అనుక్షణం ఉత్కంఠను పంచుతూ సాగుతుంది. కొత్తదనానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పట్టం కడతారు. అదే రీతిలో ఈ సినిమాను ఆదరిస్తారనుకుంటున్నా అన్నారు.

దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ ఇప్పటివరకు ఇండియన్‌ స్క్రీన్‌పై రానటువంటి కథ ఇదని తెలిపారు. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నదని, ఓ కొత్త కథను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నామని నిర్మాత విజేష్‌ తయాల్‌ పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సన్ని డి, సంగీతం: మోహిత్‌ రెహమానియక్‌, రచన-దర్శకత్వం: అరుణ్‌ విక్కిరాలా.  ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, డాలీషా, మోహిత్, మార్క్ కే రాబిన్, శశికిరణ్, నిరంజన్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News