Skip to main content

Namaste NRI

మణిశర్మ స్వరాలతో డబుల్‌ ఇస్మార్ట్‌

టాలీవుడ్ యాక్టర్ రామ్‌ పోతినేని  డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో  హై ఆక్టేన్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోంది. డబుల్ ఇస్మార్ట్‌లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు.కాగా చాలా రోజుల క్రితమే షూటింగ్ మొదలు కాగా, ఈ చిత్రానికి మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎవరనేది మాత్రం సస్పెన్స్‌లో పెడుతూ వచ్చారు. తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించారు. ఫస్ట్ పార్టుకు అదిరిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మ సీక్వెల్‌కు కూడా పనిచేస్తున్నాడు. పూరీ, మణిశర్మ‌, చార్మీతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఇసార్ట్‌ శంకర్‌ను మించిన ఆల్బమ్‌ రెడీ అవుతుందని చెప్పకనే చెప్పేసింది పూరీ టీం. డబుల్‌ ఇస్మార్ట్ 2024 మార్చి 8న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.  తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సందడి చేయనుంది.

Social Share Spread Message

Latest News