Namaste NRI

హనుమాన్‌ విరాళం 2.66 కోట్లు

తేజ సజ్జా  హీరోగా ప్రశాంత్‌ వర్మ  తెరకెక్కించిన తాజా చిత్రం హనుమాన్‌. అమృతా అయ్యర్‌ కథానాయిక. జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం 8 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల మార్కును కూడా అందుకుంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు అమ్ముడుపోయే ప్రతి టికెట్‌లో 5 రూపాయలను అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇస్తామని చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. చెప్పిన‌ట్లుగానే ప్రీమియర్‌ షోల ద్వారా వచ్చిన ఆదాయంలో రూ.14.25 లక్షలను విరాళంగా అందించింది.తాజాగా 9 రోజుల‌కు గాను ఇప్పటి వరకూ 53,28,211 హ‌నుమాన్ టికెట్లు అమ్ముడు అయ్యాయి. అయితే ఈ టికెట్ల ద్వారా వ‌చ్చిన మొత్తం రూ.2,66,41,055 ల‌ను రామమందిరానికి విరాళంగా ఇస్తున్నట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. దీనికి హనుమాన్‌ ఫర్‌ శ్రీరామ్‌ అని పేర్కొంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events