Namaste NRI

రాజ్య‌స‌భ‌కు ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి సుధామూర్తి నామినేట్

ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ నారాయ‌ణ మూర్తి స‌తీమ‌ణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభ కు నామినేట్‌ చేసారు. ప్రెసిడెంట్‌ ముర్ము ఆమెను ఎగువ సభకు నామినేట్‌ చేసిన విషయాన్ని ప్రధాని మోడీ తెలిపారు. ఉమెన్స్ డే రోజున ఈ ప్రకటన వెలువడడం విశేషం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుధామూర్తిని రాజ్య సభకు నామినేట్ చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది మన నారీ శక్తికి శక్తివంతమైన నిదర్శనమని అభివర్ణించారు. భారత రాష్ట్రపతి సుధామూర్తి ని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం, విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపార మైనది, స్ఫూర్తిదాయకం. ఆమె రాజ్యసభలో ఉండటం మన నారీ శక్తి కి ఒక శక్తివంతమైన నిదర్శనం, ఇది మన దేశం విధిని రూపొందించడంలో మహిళల శక్తి, సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమె ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను  అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events