Skip to main content

Namaste NRI

భారతీయులకు యూఏఈ బంపర్ ఆఫర్‌

యూఎస్‌, యూకే, ఈయూకు చెందిన శాశ్వత నివాస కార్డులు(పీఆర్‌సీ) లేదా వీసాలు కలిగిన భారతీయులకు యూఏఈ 14 రోజుల వీసా ఆన్‌ అరైవల్‌ (ఎయిర్‌పోర్ట్‌లోనే వీసా జారీ చేయడం) విధానాన్ని ప్రారంభించింది. సుమారు 35 లక్షల మంది భారతీయులు నివసిస్తున్న యూఏఈ-భారత్‌ మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంలో భాగంగా యూఏఈ ఈ నిర్ణయం తీసుకుంది. వీసా ఆన్‌ అరైవల్‌ పొందాలనుకొనేవారు కనీసం 6 నెలల చెల్లు బాటు కలిగిన పాస్‌పోర్ట్‌ కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం తగిన పాస్‌పోర్ట్‌, వీసా, శాశ్వత నివాస కార్డులు కలిగిన వారికి 14 రోజుల వీసా ఆన్‌ అరైవల్‌ జారీ చేస్తారు.

Social Share Spread Message

Latest News