Namaste NRI

చేతులెత్తేసిన చైనా ప్రభుత్వం … ట్రాక్‌ చేయడం అసాధ్యం  

కరోనా విషయంలో చైనా ప్రభుత్వం చేత్తులెత్తేసింది.  కొత్త కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో  ట్రాక్‌ చేయడం అసాధ్యమని ఆ దేశ ఆరోగ్య శాఖ తేల్చి చెప్పింది.  గత నెలలో అత్యధిక కేసులు నమోదైన ఇప్పుడు ఎంతమంది వైరస్‌ బారిన పడుతున్నారో తెలుసుకోవడం కష్టతరంగా మారింది.  కఠిన ఆంక్షలపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తడంతో జీరో కోవిడ్‌ పాలసీని చైనా ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. క్వారంటైన్‌, కాంటాక్ట్‌  ట్రేసింగ్‌, టెస్టుల విషయంలో నిబంధనలను సడలించింది.  ఫలితంగా కరోనా కేసులు ట్రాక్‌ చేయడం అసాధ్యమైంది.  సడలించిన నిబంధనలతో వైరస్‌ సోకి లక్షణాలు లేనివారు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా న్యూక్లిక్‌ యాసిడ్‌ టెస్టు చేయించుకోవడ లేదు.  కొత్త కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ వాటి సంఖ్యను కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. దీంతో కరోనా కేసులను ఇక ట్రాక్‌ చేయలేమని చైనా ఆరోగ్య కమిషన్‌ ప్రకటించింది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events