Namaste NRI

బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ అమెరికన్  కు  కీలక పదవి

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వంలో మరో భారతీయ  అమెరికన్ కు కీలక పదవి దక్కింది. ప్రముఖ మహిళా పారిశ్రామిక వేత్త , మాస్టర్కార్డ్ సెంటర్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ వ్యవస్థాపకురాలు షమీనా సింగ్‌ను ఎగుమతుల మండలి సభ్యురాలిగా బైడెన్ నియమించారు. ఈ మేరకు శ్వేతసౌధం ప్రకటన వెల్లడించింది. ఈ నియామకంపై షమీనా ఆనందం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ ఎగుమతుల కమిటీలో చేరడం గర్వంగా ఉందన్నారు. ఈ మండలి, అమెరికా అంతర్జాతీయ వాణిజ్యానికి ప్రధాన జాతీయ సలహా కమిటీగా వ్యవహరిస్తుంది. వాణిజ్యం, ఎగుమతుల విస్తరణ, వాణిజ్య సంబంధ అంశాలపై ప్రభుత్వ విధానాలు , కార్యక్రమాలకు ఈ మండలి అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంటుంది.  గతంలోనూ ప్రతినిధుల సభ, సెనెట్‌లో కీలక పదవులు పొందారు.  బైడెన్ యంత్రాంగంలో ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా బారత అమెరికన్లు కీలక పదవుల్లో ఉన్నారు. తాజాగా షమీనా సింగ్ కూడా ఈ జాబితాలో చేరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events