Namaste NRI

శ్వేతసౌధం కీలక ప్రకటన… అగ్రరాజ్యంలో

అమెరికాలో వ్యాక్సినేషన్‌పై శ్వేతసౌధం తాజాగా కీలక ప్రకటన చేసింది. అమెరికాలో జనాభాలో 50 శాతం మంది ప్రజలు పూర్తి స్థాయిలో కొవిడ్‌ టీకా తీసుకున్నారని వెల్లడిరచింది.  అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్‌ వణికిస్తోంది. డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ దేశంలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రతి రోజు సగటున లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కొవిడ్‌ టీకాను తీసుకోవాల్సిందిగా ప్రజలకు అమెరికా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఫలించడంతో పూర్తి స్థాయిలో టీకా పొందిన వారి సంఖ్య 50 శాతానికి చేరింది. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రకటించింది. 50 శాతం మంది అమెరికన్లు (అన్ని వయసుల వాళ్లు) పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్‌ పొందారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 165 మిలియన్ల మంది కంటే ఎక్కువ ప్రజలు టీకా రెండు డోసులను పొందారన్నమాట.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events