Namaste NRI

కొత్త ప్రయాణం ఆరంభమైంది : వరలక్ష్మి శరత్‌కుమార్‌

ఇటీవలే తన చిరకాల మిత్రుడు, గ్యాలరిస్ట్‌ నికోలస్‌ సచ్‌దేవ్‌ను పెళ్లాడింది కథానాయిక వరలక్ష్మి శరత్‌ కుమార్‌. థాయ్‌లాండ్‌లో వీరి పెళ్లి జరిగింది. వివాహానంతరం తొలిసారి తన భర్తతో కలిసి హైదరాబాద్‌కు విచ్చేసింది వరలక్ష్మి శరత్‌కుమార్‌. ఈ సందర్భంగా కొత్త దంపతులు మీడియాతో ముచ్చటించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ మాట్లాడుతూ నా సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులు చూపించిన ఆదరణ మరువలేనిది. హైదరాబాద్‌ నాకు సెకండ్‌హోమ్‌. నా భర్తతో కలిసి ఫస్ట్‌టైమ్‌ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు చేస్తాను. మీ ఆదరణ కలకాలం ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పింది. తన భార్య గ్రేట్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అని, ఆమెను పెళ్లాడటం తన అదృష్టమని నికోలస్‌ సచ్‌దేవ్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News