Namaste NRI

భారతీయ శాస్త్రవేత్తల అరుదైన ఘనత

మనచుట్టూ బోల్డంత నీరు ఉన్నా ఉపయోగానికి పనికొచ్చేది కొంతే. ఫలితంగా నీటి కొరత వేధిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నీటి కొరతను అధిగమించి శుద్ధ జలాన్ని అందించేందుకు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) పరిశోధకులు పోర్టబుల్‌ థర్మల్‌ డీశాలినేషన్‌ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఈ విధానంలో నీటిని తొలుత ఆవిరిగా మార్చి అందులోని ఉప్పు, ఇతర మలినాలను తొలగిస్తారు. ఆ తర్వాత ఆవిరిని ఘనీభవించడం ద్వారా శుద్ధ జలాన్ని సేకరిస్తారు. పెద్దపెద్ద రిజర్వాయర్లు, సముద్రపు నీరు, ఉప్పునీటి కయ్యల్లోని నీరు, భూగర్భ జలాలను ఈ విధానంలో శుద్ధి చేయవచ్చని ఐఐఎస్‌సీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సుస్మితా దాస్‌ తెలిపారు. రోజులో సూర్యుడి గమనాన్ని బట్టి డీశాలినేషన్‌ యూనిట్‌ను మార్చుకునేలా డిజైన్‌ చేసినట్టు వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events