కెనడాలో భారతీయుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ యూనిర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా నియమితులయ్యారు. కెనడాలోని ప్రాఖ్యాత భారత్కు చెందిన ప్లాంట్ ఫిజియాలజిస్టు ప్రొఫెసర్ హెచ్ డీప్ సైని ని ప్రిన్సిపల్, వైస్ ఛాన్స్లర్గా నియామకం అయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇండియాలో పుట్టి పెరిగిన హెచ్ డీప్ సైని, లుథియానాలోని పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బోటనీలో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు. ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని నుంచి ప్లాంట్ ఫిజియాలజీలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1న హెచ్ డీప్ సైని బాధ్యతలు స్వీకరించనున్నట్టు తెలిపింది.
ఈ యూనివర్సిటీలో దాదాపు 10వేల మంది విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నారు. అందులో దాదాపు 27శాతం మంది భారతీయులే. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ప్రకారం ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీల జాబితాలో ఇది 31వ స్థానంలో ఉంది. అదే కెనడాలో మాత్రం నెంబర్ యూనిర్సిటీగా నిలిచింది.