Namaste NRI

 అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌ యువకుడు మృతి

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైయేశ్‌ వీర (24) మృతి చెందాడు. అమెరికాలో సైయేశ్‌  మాస్టర్స్‌ డిగ్రీ చేస్తూ పెట్రోల్‌ బంక్‌లో క్లర్క్‌గా పనిచేస్తున్నట్టు కొలంబస్‌ పోలీసులు తెలిపారు. సైయేశ్‌ పనిచేస్తున్న పెట్రోల్‌ బంక్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుడిని దవాఖానకు తరలించి వైద్యం అందిస్తున్న తరుణంలో మృతి చెందాడని వారు వెల్లడించారు. ఈ  ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. సైయేశ్‌ కొన్ని రోజుల్లో ఉద్యోగం మానేయాలనుకున్న తరుణంలో ఈ దారుణం జరిగిందని మృతుడి బంధువు రోహిత్‌ ఆవేదన చెందారు. సైయేశ్‌ ఆపదలో ఉన్నవారికి సాయం చేసేవాడని, మంచి క్రికెటరని తెలిపాడు.

Social Share Spread Message

Latest News