Namaste NRI

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క‌లిసిన సినీ  న‌టుడు ఆమిర్ ఖాన్

 ప్రముఖ సినీ నటుడు, నిర్మాత ఆమిర్ ఖాన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమిర్ ఖాన్ ఇటీవల సితారే జమీన్ పర్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు మొద‌టి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావ‌డంతో థియేట‌ర్‌ల‌లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాను ఢిల్లీలో ఒలింపిక్ ఛాంపియన్‌ల కోసం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా.. ఆమిర్ ఖాన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలోనే ఆయన రాష్ట్రపతిని కలుసుకున్నారు. ఈ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గోన్నారు.

Social Share Spread Message

Latest News