Namaste NRI

సిడబ్ల్యూసి సమావేశాలను ప్రారంభించిన ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే

హైదరాబాద్ వేదికగా సిడబ్ల్యూసి సమావేశం ప్రారంభమయింది.  ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జాతీయ జెండాను ఆవిష్కరించి ఈ సమావేశాన్ని ప్రారంభించారు. సిడబ్ల్యూసి  సభ్యులు జాతీయ జెండాకు వందనం చేశారు. హైదరాబాద్‌లో హోటల్ తాజ్ కృష్ణ హాటల్‌లో జరుగుతోన్న ఈ సమావేశాలకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. మరికొన్ని నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో జరుగుతోన్న ఈ సిడబ్ల్యూసి సమావేశాలకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక, ఈ సమావేశానికి సిడబ్ల్యూసి సభ్యులతో పాటు నాలుగు రాష్ట్రాల కాంగ్రెస్ సిఎంలతో పాటు పార్టీ కీలక నేతలు కెసి వేణుగోపాల్, సుర్జేవాలా, జైరాం రమేష్ తదితర నేతలు హాజరయ్యారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events