Namaste NRI

ఈ ఒప్పందాన్ని అన్ని దేశాలూ స్వాగతించాయి : బైడెన్‌

ఇజ్రాయెల్‌ – హెజ్బొల్లా మధ్య యుద్ధం ముగిసింది. క్షిపణులు, రాకెట్ల దాడులతో దద్దరిల్లిన దక్షిణ లెబనాన్‌లో శాంతి నెలకొన్నది. 14 నెలల పాటు కొనసాగిన పోరాటానికి ఇరుపక్షాలు స్వస్తి పలికాయి. అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. ఈ ఒప్పందంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కాస్త ఉపశమనం లభించింది. మొదట 60 రోజుల కోసం ఒప్పందం కుదిరినా, శాశ్వత ఒప్పందంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ ఒప్పందా న్ని ఇరాన్‌, పాలస్తీనా సహా అన్ని దేశాలూ స్వాగతించాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తామూ సిద్ధంగా ఉన్నట్టు హమాస్‌ ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్‌ 7న మొదలైన సంక్షోభం క్రమంగా కొలిక్కి వస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events