Namaste NRI

అమెరికా గూఢచర్యానికి పాల్పడుతోంది:  చైనా ఆరోపణ

ఈ ఏడాది జనవరి – ఫిబ్రవరి మధ్య అమెరికా గగనతలంలో చైనా బెలూన్లు కనిపించడంతో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. అమెరికాపై చైనా గూఢచర్యానికి పాల్పడుతుందని ఆరోపించింది. ఆ తర్వాత నిఘా బెలూన్లను కూల్చివేసిన విషయం విధితమే. ఈ వివాదం కారణంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఫిబ్రవరిలో తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇటీవల వివాదం సద్దుమణిగినా బ్లింకెన్‌ పర్యటన షెడ్యూల్‌ ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ క్రమంలోనే చైనాపై అమెరికా గూఢచర్యానికి పాల్పడుతుందని డ్రాగన్‌ దేశం ఆరోపించింది.

అమెరికా ఉపగ్రహాలు కనీసం 14 సార్లు చైనా ఉపగ్రహాలపై నిఘా పెట్టేందుకు ప్రయత్నించాయని చెప్పింది. గత రెండేళ్లలో నిఘాకు ప్రయత్నించాయని పేర్కొంటూ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. యూఎస్ వైమానిక దళం జియోసింక్రోనస్ స్పేస్ సిట్యుయేషనల్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌కు చెందిన ఉపగ్రహాలు చైనా అత్యంత ప్రత్యేకమైన, అధునాతన ఉపగ్రహాలకు దగ్గరగా వచ్చి గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events