Namaste NRI

భారత్‌కు సానుకూలంగా అమెరికా నిర్ణయం

రష్యా చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై విరుచుకుపడిన అమెరికా.. అనూహ్య నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి ఎస్‌-400 క్షిపణులను కొన్నందుకు భారత్‌పై విధించిన ఆంక్షల విషయంలో మినహాయింపును ఇచ్చేందుకు తాజాగా అమెరికా ప్రతినిధుల సభ అంగీకారం తెలిపింది. ఆ మేరకు కాట్సా చట్టం ఆంక్షల నుంచి భారతదేశాన్ని మినహాయించాలంటూ అమెరికా కాంగ్రెస్‌ దిగువ సభ ప్రజా ప్రతినిధుల సభలో భారతీయ అమెరికన్‌ సభ్యుడు రో ఖన్నా ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టారు. ఖన్నాతో పాటు మరో ఇద్దరు సభ్యులు ప్రతిపాదించిన ఈ బిల్లును సభ విదేశీ వ్యవహారాల కమిటీ ఆమోదం కోసం పంపారు. పాలక డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన ఖన్నా ఇటీవల ఇటువంటి సవరణనే అమెరికా జాతీయ రక్షణ ప్రాధికార చట్టం (ఎన్‌డీఏఏ)కి ప్రతిపాదించారు. ఆ సవరణలో సభలోని పాలక, ప్రతిపక్షాలు రెండు ఆమోదించాయి. ఇప్పుడు కాట్సా చట్టానికి ఇటువంటి సవరణనే ప్రతిపాదిస్తున్నానని ఖన్నా వివరించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events