Namaste NRI

త్వరలో అమెరికా కీలక నిర్ణయం!

అమెరికాలో పౌరులకు నాలుగో డోసూ వేయాల్సిన అవసరం రావొచ్చని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు, ప్రధాన వైద్య సలహాదారు ఆంటోని ఫౌచీ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల వయస్సు, వ్యక్తిగత ఆరోగ్య సమస్యల ఆధారంగా ఈ డోసు వేయాల్సి ఉంటుందన్నారు. మరొక బూస్టర్‌ అవసరం ఉండొచ్చని తెలిపారు. ఒమిక్రాన్‌ డబ్ల్యూహెచ్‌వో ఆందోళనకర వేరియంట్‌గా ప్రకటించినప్పటి నుంచి అగ్ర రాజ్యంలో సుమారు లక్ష మరణాలు  సంభవించడం గమనార్హం. ఈ నేపథ్యంలో నాలుగో డోసుపై ఫౌచీ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. నవంబర్‌లో ఒమిక్రాన్‌ బయటపడినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అయిదు లక్షల మంది కరోనాతో మరణించారని డా.ఫౌచీ ఇది వరకు వెల్లడిరచిన విషయం తెలిసిందే. దీన్ని మహమ్మారి పూర్తిగా విస్తరించిన దశగా అభివర్ణించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events