Namaste NRI

ఎన్నారైల పై మరో పిడుగు …స్వదేశాలకు పంపే డబ్బుపై

డాలర్‌ డ్రీమ్స్‌తో అమెరికాలో అడుగుపెట్టిన ఎన్నారైలకు డొనాల్డ్‌ ట్రంప్‌ చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు వీసా నిబంధనలు కఠినతరం చేయగా, మరోవైపు జన్మతః పౌరసత్వం రద్దు, ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అక్రమ వలసదారులను ఏరివేస్తూ, స్వదేశాలకు తిప్పి పంపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా పౌరసత్వం లేనివారి పై మరో పిడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. అమెరికా పౌరసత్వం లేనివారు తమ స్వదేశాలకు పంపే డబ్బుపై పన్ను విధించాలని నిర్ణయించారు. అంటే విద్యార్థులు, వర్క్‌ వీసాలపై పనిచేస్తున్నవారు తమ ఇంటికి డబ్బు పంపాలంటే 5 శాతం పన్ను కట్టాల్సి వస్తుందన్నమాట. ఆ దేశ దిగువ సభలో ఈ నెల 12న ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులో ట్రంప్‌ సర్కార్‌ ఈ ప్రతిపాదనలు పొందుపరిచింది. ఇలా వసూలైన నిధులను సరిహద్దు రక్షణకు వినియోగిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. జూలై 4 నాటికి చట్టంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events