బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు ఓ వైపు ఆర్తిక సంక్షోభం సవాల్ విసురుతుంటే మరోవైపు పన్నుల సమస్య వెంటాడుతోంది. తాజాగా పన్నుల విషయంలో సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు తిరుగుబాటు ఎదురైంది. దేశంలో పన్నులు అధికంగా ఉన్నాయని, వాటిని తక్షణమే తగ్లించాలని డిమాండ్ చేస్తూ కన్జర్వేటివ్ వే పార్వార్డ్ గ్రూప్ ఆర్థిక మంత్రికి లేఖ రాసింది. ఈ లేఖపై 40 మంది టోరీ ఎంపీలు సంతకాలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక పన్నులు ఇప్పుడు చూస్తున్నాం. పన్ను చెల్లింపుదారుల డబ్బు నుంచి ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ ఉండాలి. ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి. పన్ను చెల్లింపు దారుల డబ్బును వృథా చేయకుండా ప్రజాపథకాలను వినియోగించాలి. ప్రజలపై పన్ను భారం తగ్గించాలి అని ఎంపీలు కోరారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)