Namaste NRI

కువైత్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి టీచర్ల వంతు!

ప్రవాసుల విషయంలో గల్ఫ్ దేశం కువైత్  మరో కఠిన నిర్ణయం.  2022-23 విద్యా సంవత్సరంలో ఏకంగా 1,875 మంది ప్రవాస టీచర్లపై వేటు వేసే ప్లాన్‌లో ఉందట. ఈ మేరకు విద్యాశాఖ కసరత్తు మొదలెట్టిందని సంబంధిత వర్గాల సమచారం. విద్య, ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధనశాఖ మంత్రి డాక్టర్ హమద్ అల్-అద్వాన్ పర్యవేక్షణలో ఇప్పటికే ఈ విషయంలో కసరత్తు జరుగుతుందని, కువైటైజేషన్ పాలసీలో  భాగంగా ఎడ్యుకేషనల్ జాబ్స్‌లో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇక తొలి దశలో స్పెషలైజేషన్ లేని 25శాతం మంది ప్రవాస టీచర్లను తొలగించాలని ప్రణాళిక రెడీ చేసిందని తెలుస్తోంది. ప్రవాస టీచర్ల స్థానంలో కువైటీలను భర్తీ చేసేలా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుందట విద్యాశాఖ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events