సంతోష్ శోభన్ హీరో గా ప్రియా భవానీ శంకర్ నటించిన చిత్రం కళ్యాణం కమనీయం . యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్నాడు. సంతోష్ శోభన్ టీం ప్రమోషన్స్ లో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా సంతోష్ శోభన్ మాట్లాడుతూ కళ్యాణం కమనీయం అనేది శివ అండ్ శృతి ప్రపంచం. ఇలాంటి ప్రపంచాన్ని సృష్టించాలంటే కార్తీక్ ఘట్టమనని కంటే ఉత్తమంగా ఎవరూ చేయలేరేమో. మా కోసం ఈ ప్రపంచాన్ని సృష్టించిన కార్తీక్కు ధన్యవాదాలు. ఇంతకుముందు నేను చేసిన సినిమాల్లో ఒక పాట వచ్చినపుడు.. ఆ పాట మొదలైనపుడు కథ ఆగేది. పాట అయిపోయిన తర్వాత మళ్లీ కథ మొదలయ్యేది. కమర్షియల్ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్ ఫార్మాట్లో ఉండే టెక్నిక్ ఇది. కానీ ఈ సినిమాలో పాట వచ్చినపుడల్లా అది కథను ముందుకు తీసుకెళ్తుంది. కథ ఎప్పుడూ ఆగదు. అనిల్ కుమార్ అంత నిజాయితీగా కథను చెప్పాడన్నాడు.
అనిల్ కుమార్- శ్రావణ్ భరద్వాజ్ కాంబినేషన్లో ఈ సినిమాకు అద్బుతమైన మ్యూజిక్ దొరికే అవకాశం వచ్చింది. అనిల్ కుమార్ ఈ కథ రాసుకున్నపుడు నేను మాత్రం హీరోగా ఫస్ట్ ఆప్షన్ కాదు అతడెవరో అనిల్ కుమార్ను అడగండి. కానీ కథ చెప్పినప్పటి నుంచి శృతి పాత్ర కోసం ప్రియా భవానీ శంకర్నే ఫస్ట్ చాయిస్గా తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. జనవరి 14న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో సద్దాం, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.