తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో టీఎఫ్సీసీ అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 కార్యక్రమాన్ని ఆగస్టు 12న దుబాయ్లో నిర్వహించబోతున్నామని ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ 2021, 22 ఏడాదిలో విడుదలైన సినిమాలకు టీఎఫ్సీసీ అవార్డ్స్ అందించబోతున్నాం. మొత్తం 13 మంది జ్యూరీ సభ్యులు ఎంపికలో పాల్గొంటారు. ఆగస్టు 12న దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆసక్తి గల వారు వివిధ కేటగిరీల్లో అవార్డుల కోసం ఐప్లె చేసుకోవచ్చు. అన్నారు. ఈ కార్యక్రమంలో నటులు మురళీమోహన్, సుమన్, దర్శకులు బి. గోపాల్, రేలంగి నరసింహారావు, నటి రోజా రమణి తదితరులు పాల్గొన్నారు.