రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన సప్త సాగరాలు దాటి సైడ్-ఏ చిత్రం. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదలైన విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల తెలుగు ప్రేక్షకులకు అందించారు. తాజాగా సప్త సాగరాలు దాటి- సైడ్ B ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ట్రైలర్ చూస్తే.. మను జైలు నుంచి విడుదలైన 10 సంవత్సరాల అనంతరం ఏం జరిగింది అనేది స్టోరీ అని తెలుస్తుంది. హేమంత్ ఎం రావు ఈ చిత్రానికి దర్శకుడు. ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది.














