రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా.. పార్లమెంట్ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు.
ఖైరతాబాద్ గణేశ్ -2022 విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ ఏడాది పంచముఖ మహాలక్ష్మి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను రెడ్కో, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్లు సతీశ్ రెడ్డి, అనిల్ కుర్మాచలం ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్లను మంత్రి కేటీఆర్ అభినందించారు.
రాష్ట్ర సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్గా టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ యెరువు సతీశ్రెడ్డి నియమితులయ్యారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరు ఖరారైంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన అనంతరం ..ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేశామని జేపీ నడ్డా తెలిపారు.
సర్కారు వారి పాట సక్సెస్ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు హీరో మహేశ్ బాబు.ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తర్వాత తన ఫ్యామిలీతో కలిసి న్యూయార్క్లోని మన్హట్టన్(5th Avenue, Manhattan)లో బిజీగా ఉండే 5th Avenue వెంట నడుచుకుంటూ వెళ్లారు మహేశ్, నమ్రత.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ శత వసంతంలోకి అడుగుపెట్టారు. తన మాతృమూర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆమెకు మిఠాయి తినిపించారు. ఆపై హీరాబెన్ కాళ్లు కడిగి.. ఆశీర్వాదం తీసుకున్నారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు.వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పండితులు మంత్రికి వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు.