Skip to main content

Namaste NRI

ప్రముఖ నటి పూనమ్‌కౌర్‌ మాజీమంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురునానక్ జయంతిని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఏక్‌ ఓంకార్‌ సందేశంతో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.

వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్‌ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పార్టీ మహాధర్నా చేపట్టింది. రైతు మహాధర్నాలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)సీఎండీ సంజయ్ మల్హోత్రా(ఐఏఎస్), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ ఎస్ ధిల్లాన్ కలిశారు. వీరు సీఎం వైఎస్ జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.