Namaste NRI

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాద్యకారుడు రామ చంద్రయ్యకు సీఎం కేసీఆర్‌ భారీ సాయం చేశారు. కోటీ రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం కోటీ రూపాయలు ప్రకటించారు.

కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొగిలయ్య సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు.

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ చాంబర్‌లో ప్రొటెం చైర్మన్‌ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు.

తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం వెంకటేశ్వరావు మాదవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. కాబోయే నూతన వధూవరులకు 365 రకాల వంటలను రుచి చూపించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చెముడు లంకకు చెందిన ప్రత్తి సత్యనారాయణ కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకే సారి అరిటాకుల్లో భోజనం పెట్టారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో మెగాస్టార్‌ చిరంజీవి భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికే ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి సమావేశం అయ్యారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగుతాయని, తప్పక హాజరు కావాలని కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్‌ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.