ఇటీవల మరణించిన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిక్కు రెండవ సారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ క్యాటగిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కడం విశేషం.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సందర్శనకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఎన్ఎస్యూఐ నాయకులు చంచల్గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. వీరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క ములాఖత్లో కలిసి పరామర్శించారు.
రష్యా మే 9వ తేదీన విక్టరీ డే పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మాస్కోలో విక్టరీ డే పరేడ్ రిహార్సల్స్ జరిగాయి.
వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్ లో కై టెక్స్ పార్క్ వస్త్రా పరిశ్రమకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
డీఎంకే ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి అయిన సందర్భంగా తమినాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆర్టీసీ బస్సు లో ప్రయాణించి మహిళలకు కల్పించిన ఉచిత బస్ సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ టూరిజం, క్రీడలు, సాంస్కృతిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి రోజా లోటస్ పాండ్లో వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను కలిశారు. ఈ సందర్భంగా రోజాను విజయమ్మ అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీ యూరప్లో తన మూడు దేశాల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్ బ్రాండెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ప్రధానికి భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు.
హైదరాబాద్లోని కొత్తపేట వాసవి కాలనీలోని అష్టలక్ష్మీ దేవాలయ 26వ బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరిగాయి.
భారత ఆర్మీ చీఫ్గా జనరల్ మనోజ్ పాండే బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పాండే ఈ పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటి వరకూ జనరల్ మనోజ్ పాండే ఆర్మీకి ఉప చీఫ్గా పనిచేసిన విషయం తెలిసిందే.
ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టుల సీజేలు, రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సును ప్రారంభమైంది.