Namaste NRI

దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిన్నకుమార్తె ఉమామహేశ్వరి, శ్రీనివాసప్రసాద్ ల కుమార్తె విశాలను పెళ్లికుమార్తెను చేసే వేడుక మాదాపూర్లోని ఓ హోటల్లో జరిగింది. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు హాజరై పెళ్లికుమార్తైను ఆశీర్వదించారు. చంద్రబాబునాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చాలాకాలం తర్వాత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి తనయుడు హర్షవర్ధన్, రాధ దంపతుల కుమార్తె నిహారిక, హైదరాబాద్కు చెందిన చుండూరు వెంకట లక్ష్మణరావు, మాధురీ దేవి దంపతుల కుమారుడు రవితేజల వివాహం శంషాబాద్ విమానాశ్రయం జీఎమ్మార్ ఎరీనాలో వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై ప్రధానితో విజయసాయిరెడ్డి చర్చించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి తెలియజేశారు.

నూత‌న స‌చివాల‌య నిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిశీలించారు. స‌చివాల‌య నిర్మాణ ప‌నుల గురించి ఆర్ అండ్ బీ అధికారులు, ఇంజినీర్లు సీఎం కేసీఆర్‌కు వివ‌రించారు. ప‌నుల పురోగ‌తిని అధికారుల‌ను అడిగి సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు.

ఎం ఎల్ సి లుగా ఎన్నికైన సందర్భంగా ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె సి ఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన కడియం శ్రీహరి, పట్నం మహిందర్ రెడ్డి, శంభిపుర్ రాజు, కసిరెడ్డి నారాయణ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, పి వెంకట్ రామ్ రెడ్డి.