Namaste NRI

జీ7 సదస్సుకు రండి.. ప్రధాని మోదీని ఆహ్వానించిన జర్మనీ

ఉక్రెయిన్‌ రష్యా దాడులు కొనసాగుతున్న వేళ మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జీ7 సదస్సుకు భారత్‌ను తప్పకుండా ఆహ్వానిస్తామని అతి త్వరలోనే భారత్‌కు అధికారికంగా ఆహ్వానం కూడా పంపుతామని జర్మనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశమే  కాకుండా,  జూన్‌లో జర్మనీ వేదికగా జరిగే మరో సమావేశానికి కూడా భారత్‌కు ఆహ్వానం ఉంటుందని జర్మనీ అధికారులు అనధికారికంగా పేర్కొంటున్నారు. ఉక్రెయిన్‌` రష్యా మధ్య జరిగిన యుద్ధంలో భారత్‌ తటస్థ వైఖరి అవలంబించిన కారణంగా జీ7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించకూడదని జర్మనీ నిర్ణయించిందని  సమాచారం. కానీ ఆ తర్వాత జర్మనీ మనస్సు మార్చుకుందని, జీ 7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించిందుకు రెడీ అయిందని తెలిసింది.జీ 7 సదస్సుకు భారత్‌కు ఆహ్వానం లేదని వార్తలు వస్తున్నా, భారత ప్రభుత్వం మాత్రం దీనిపై ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. జర్మనీయే స్పందించి భారత్‌కు ఆహ్వానం పంపుతామని అనధికారికంగా పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events