తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలు హైదరాబాద్ ఫిలించాంబర్లో జరిగాయి. ఉదయం నుంచి ఓటింగ్ ప్రారంభమైంది. ఈ కౌన్సిల్లో మొత్తం 1134 మంది సభ్యులున్నారు. ఇందులో 678 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో దామోదర ప్రసాద్ అధ్యక్షుడిగా గెలుపొందారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన జెమినీ కిరణ్పై 24 ఓట్ల తేడాతో దామోదర ప్రసాద్ గెలుపొందారు. ఆయనకు దిల్ రాజు సారథ్యంలోని ప్రొడ్యూసర్స్ గిల్డ్ మద్దతు ఇచ్చింది. ఉపాధ్యక్షులుగా కె. అశోక్ కుమార్, సుప్రియ, కోశాధికారిగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ విజయం సాధించారు. కార్యదర్శులుగా ప్రసన్నకుమార్, వైవీఎస్ చౌదరి, జాయింట్ సెక్రటరీలుగా భరత్ చౌదరి, నట్టికుమార్ ఎన్నికయ్యారు.
15 మంది ఈసీ మెంబర్స్ ..
దిల్ రాజు -470
దానయ్య -421
రవి కిషోర్ -419
యలమంచిలి రవి -416
పద్మిని -413
బెక్కం వేణుగోపాల్ -406
సురేందర్ రెడ్డి -396
గోపీనాథ్ ఆచంట -353
మధుసూదన్ రెడ్డి -347
కేశవరావు -323
శ్రీనివాద్ వజ్జ -306
అభిషేక్ అగర్వాల్ -297
కృష్ణ తోట -293
రామకృష్ణ గౌడ్ -286
కిషోర్ పూసలు -285.














