Namaste NRI

అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్లే.. రెండు దేశాలుగా

ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల పునరేకీరణకు అమెరికానే ప్రధాన అడ్డంకి అని ఉత్తర కొరియా విమర్శించింది. తమ పట్ల అమెరికా శత్రుపూరిత వైఖరిని వీడనంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదని ఐక్యరాజ్య సమితిలో ఉత్తర కొరియా శాశ్వత ప్రతినిధి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికా అనుసరిస్తూ ఈ వైఖరి వల్ల కొరియా ద్వీపకల్పంలోని ప్రజలు తమకు ఇష్టం లేకున్నా రెండు దేశాలుగా విడిపోయి ఉండాల్సి వస్తోంది. అణు పరీక్షలు నిర్వహించడం వల్లే ఈ సమస్య వచ్చిందని అనుకుంటే పొరపాటు. ఉత్తర కొరియా ఏర్పడిన మరు క్షణం అమెరికా మా అసౌర్వభౌమతాన్ని గుర్తించేందుకు నిరాకరిస్తోది. మమ్మల్ని శత్రు రాజ్యంగా పరిగణిస్తోంది.  మా ప్రజలు ఎంచుకున్న సోషలిస్టు వ్వవస్థ పట్ల బాహాటంగా శత్రుపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events