Namaste NRI

హిందువులను భారత్‌కు వెళ్లగొట్టండి… ఖలిస్థాన్‌ హెచ్చరిక

కెనడాలోని సుమారు 8 లక్షల మంది హిందువులను బహిష్కరించాలని, వారిని భారత్‌కు పంపాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. టొరంటోలో హిందూ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బోనులో ఉంచిన మోదీ, అమిత్‌ షా, జైశంకర్ దిష్టిబొమ్మలను ప్రదర్శించారు. టొరంటోలోని మాల్టన్ గురుద్వారాలో ఈ సంఘటన జరిగింది. కెనడాలోని వేలాది మంది ఖలిస్థానీ సానుభూతిపరులు ఈ హిందూ వ్యతిరేక ర్యాలీలో పాల్గొన్నారు.

కెనడాలో నివసిస్తున్న సుమారు 8,00,000 మంది హిందువులను దేశం నుంచి బహిష్కరించాలని, వారిని భారత్‌కు వెళ్లగొట్టాలని ఖలిస్థానీ మద్దతుదారులు డిమాండ్‌ చేశారు. హిందువులు, భారత దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దిష్టిబొమ్మలు జైలులో ఉన్న నమూనాతో కూడిన వాహనాన్ని ఈ ర్యాలీ సందర్భంగా ప్రదర్శించారు. ఖలిస్థాన్‌ అనుకూల రాతలతో సిక్కు గురుద్వారా, హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన సంఘటనల నేపథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events